ఏడాది పొడవునా సెలవుల కోసం హృదయపూర్వకమైన, దైవిక ప్రేరణాత్మక సందేశాలను ఆస్వాదించండి.
క్రిస్మస్ సమయంలో మార్గదర్శక ధ్యానం
శ్రీ మృణాళినీమాతగారి ద్వారా
డిసెంబర్ 23, 2002న ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్కి నాల్గవ అధ్యక్షురాలైన ప్రియమైన శ్రీ శ్రీ మృణాళినీమాతగారి నేతృత్వంలో రోజంతా జరిగిన క్రిస్మస్ ధ్యానము నుండి సారాంశాలు.
1936లో రోజంతా క్రిస్మస్ ధ్యానం సందర్భంగా పరమహంస యోగానందగారి మాటలను తన ప్రారంభ బిందువుగా తీసుకుంటూ, ఆమె తన గురువుతో అనుసంధానంలో ఉన్న భక్తి మరియు జ్ఞానం యొక్క లోతుల నుండి ధ్యానాన్ని నడిపించారు. శాస్త్రీయమైన ధ్యాన పద్ధతుల అభ్యాసం మరియు పూర్తి శరణాగతి ద్వారా అనంతమైన క్రీస్తు చైతన్యమును పొందటానికి మన గ్రహణశక్తిని పెంచుకోవాలని ఆమె ప్రోత్సహించారు.
స్వల్ప నిశ్శబ్దం కాలాలు ధ్యానసమయంలో ప్రత్యేకించి యుంచబడ్డాయి, ఇవి ఈ జ్ఞానం మరియు స్ఫూర్తిని మరింత లోతుగా తీసుకోవడానికి మనకు సహాయపడతాయి.
క్రీస్తు మీతోనే ఉన్నాడని ఎప్పుడు తెలుసుకుంటారు?
క్రీస్తు చైతన్యంపై పరమహంస యోగానందగారు
సర్వవ్యాపి అయిన క్రీస్తుకు ఊయల
కొత్త సంవత్సరంలోకి ప్రవేశం
కొత్త నిర్ణయాలు తీసుకోండి: మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి!
పునరుత్థానంపై ధ్యానం